;

రిజర్వేషన్లను 52 శాతానికి పెంచి రాజ్యాంగ సవరణ చేయాలి – బీసీ జేఏసీ

news

రిజర్వేషన్లను 52 శాతానికి పెంచి రాజ్యాంగ సవరణ చేయాలి – బీసీ జేఏసీ

కాచిగూడ, డిసెంబర్ 7: పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుత 22 శాతం నుంచి 52 శాతానికి పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లలో రాజ్యాంగబద్ధమైన మార్పులు చేయాలని కోరుతూ, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలోని బృందం ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించింది.

తరువాత మీడియాతో మాట్లాడుతూ గుజ్జ కృష్ణ, బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించినా, బీసీల జీవన స్థితిలో పెద్ద మార్పు రాలేదని, “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లు పరిస్థితి నడుస్తోందని వ్యాఖ్యానించారు.

బీసీలు సంఘటితమై, తమ హక్కుల కోసం ఒక గొంతుకగా నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నందగోపాల్, ఉదయ్ నేత, కె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......