;

తెలంగాణలో బీసీ రాజకీయ ఐక్యతకు అఖిలేష్ యాదవ్ పర్యటన – ఘన స్వాగతం తెలిపిన బేరి రామచంద్ర యాదవ్

news

తెలంగాణలో బీసీ రాజకీయ ఐక్యతకు అఖిలేష్ యాదవ్ పర్యటన

– ఘన స్వాగతం తెలిపిన బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి,

బీసీ రాజకీయ ఐక్యత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్‌కు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసేలా సమైక్యత యాత్ర చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్, బీసీ కులగణన అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకురావాలని అఖిలేష్ యాదవ్‌ను కోరారు.

అఖిలేష్ యాదవ్ తన తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై బీసీ రాజకీయ ఐక్యతపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా నిలబడి బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం చేయాలని బేరి రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన అఖిలేష్ యాదవ్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, బీసీ ఉద్యమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీలను సంఘటితం చేసి అసెంబ్లీ, పార్లమెంటులలో కనీసం 50 శాతం ప్రాతినిధ్యం సాధించే దిశగా స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నేతలు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మందాడి అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......