;

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించాలి: కోడూరి చంద్రయ్య డిమాండ్

news

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించాలి: కోడూరి చంద్రయ్య డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు కోడూరి చంద్రయ్య తీవ్రంగా విమర్శించారు.

ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని, పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలను పాత బీసీ రిజర్వేషన్ల విధానంలో నిర్వహించడం ద్వారా బీసీలను తెలంగాణ రాష్ట్రంలో వంచించినట్లే జరిగిందని ఆరోపించారు.

ఇప్పుడు జరగబోయే ఎంపిటిసి (మండల పరిషత్), జడ్పిటిసి (జిల్లా పరిషత్) ఎన్నికలలో అయినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లివచ్చినా, ఏఐసీసీ సమావేశాలలో గానీ, పార్లమెంట్ లోక్‌సభ సమావేశాలలో గానీ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని చంద్రయ్య అన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రతిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి తీసుకురాకపోవడం కూడా ముఖ్యమంత్రి నిర్లక్ష్య ధోరణినే స్పష్టంగా చూపుతోందని విమర్శించారు.

ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని గుర్తు చేసిన కోడూరి చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి, దానిని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చేలా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగేలా పార్లమెంటులో గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో

బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో-కన్వీనర్ కడార్ల నరసయ్య,

మూల భాస్కర్ గౌడ్,

జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్,

పొనకల్ గ్రామ మొదటి వార్డు సభ్యుడు ముధురుకోల్ల రవి,

రెండవ వార్డు సభ్యుడు పిళ్లి మల్లయ్య,

పొనకల్ పట్టణ వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్,

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకులు గోపి సత్యనారాయణ,

జన్నారం మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు అయిలవేణి రవి

తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......