;

న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన కేసన శంకరరావు

news

న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన కేసన శంకరరావు

ఓబీసీ జనగణన, జనాభా దామాషా రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాలి – రిప్రజెంటేషన్ సమర్పణ

న్యూఢిల్లీ:

న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షాని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు గారు కలిసి, ఓబీసీల ప్రధాన డిమాండ్లపై సమగ్ర రిప్రజెంటేషన్ సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే జనగణనలో బీసీ కులాల వారీగా కుల జనగణన నిర్వహించి, ఓబీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం అత్యవసరమని స్పష్టం చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసి, పెంచిన ఓబీసీ రిజర్వేషన్లను షెడ్యూల్–9లో చేర్చి సంపూర్ణ రాజ్యాంగ రక్షణ కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మీడియాతో మాట్లాడుతూ కేసన శంకరరావు గారు, బీపీ మండల్ నివేదిక కాలంలో ఓబీసీల జనాభా 52 శాతం కాగా, ప్రస్తుతం అది 60 శాతానికి మించిపోయిందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సామాజిక న్యాయం లక్ష్యం ఉన్నప్పటికీ, వాస్తవంగా ఓబీసీలకు అన్ని రంగాలలో సముచిత న్యాయం అందడం లేదన్నారు.

73వ, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీలు, మునిసిపాలిటీలలో ఓబీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి అడ్డంకి కారణంగా ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

దీని ఫలితంగా:

ఇక 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్లే 50 శాతం పరిమితి ఇప్పటికే మించిపోయిందని గుర్తుచేస్తూ, ఎస్సీ–ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకూ జనాభా దామాషా రిజర్వేషన్లు కల్పించాల్సిందే అన్నారు. ఇందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న 50 శాతం పరిమితిని అధిగమించేందుకు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

అదనంగా ఆయన రిప్రజెంటేషన్‌లో కోరిన ముఖ్య డిమాండ్లు:

వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలతో పాటు సమస్త జీవన రంగాలలో ఓబీసీలకు జనాభా దామాషా మేరకు – “మేమెంతో, మాకంత” వాటా ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......