;

గవర జాతీయుల సావినీర్ పంపిణీకి విస్తృత పర్యటన

news

గవర జాతీయుల సావినీర్ పంపిణీకి విస్తృత పర్యటన

రాజమండ్రి నుంచి కాకినాడ వరకు గౌరీ సంఘాల పెద్దలతో భేటీ

రాజమండ్రి / కాకినాడ (ప్రత్యేక ప్రతినిధి):
అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర జాతీయుల చరిత్ర, సంస్కృతి, సామాజిక సేవలను ప్రతిబింబించేలా రూపొందించిన గవర జాతీయుల సావినీర్ ను విస్తృతంగా పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

501 పేజీలతో 51 వేల ప్రతులుగా ముద్రించిన ఈ సావినీర్‌ను గవర జాతీయులలోని ప్రముఖులు, గౌరీ సంఘాల పెద్దలకు అందజేయడానికి ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని రూపొందించినట్లు ట్రస్ట్ సభ్యుడు ఆడారి ఉమా శంకరరావు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తేది : 01-01-2026 సాయంత్రం రాజమండ్రికి చేరుకుని, 02-01-2026 న రాజమండ్రి, దవలేశ్వరం, శ్రీరంగపట్నం మరియు పరిసర గ్రామాల్లోని గౌరీ సంఘాల పెద్దలను కలసి “గవర జాతీయుల – సావినీర్ బ్రోచర్లు” అందజేయనున్నారు. అనంతరం 04-01-2026 న స్వగ్రామానికి తిరిగి చేరుకుంటారు.

అలాగే 05-01-2026 న అనకాపల్లిలో నిర్వహించనున్న సీనియర్ సిటిజన్ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
తదుపరి 06-01-2026 నుండి 11-01-2026 వరకు పిఠాపురంలోని బాబా ఆశ్రమంలో ఉంటూ, కాకినాడ, కిర్లంపూడి సహా చుట్టుపక్కల గవర జాతీయులు నివసించే అన్ని ప్రాంతాల్లో పర్యటించి, గౌరీ సంఘాల పెద్దలను కలసి సావినీర్ బ్రోచర్లను అందజేయనున్నట్లు వెల్లడించారు.

గవర జాతీయుల ఐక్యత, సామాజిక చైతన్యం, భవిష్యత్ తరాలకు ప్రేరణ కల్పించే లక్ష్యంతో ఈ సావినీర్ రూపొందించబడిందని, ఇది జాతీయ స్థాయిలో గవర సమాజానికి ఒక చారిత్రాత్మక డాక్యుమెంట్‌గా నిలుస్తుందని సంఘ పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలిస్తే నిర్వహించబడతాయని ట్రస్ట్ వర్గాలు స్పష్టం చేశాయి.


సంప్రదించవలసిన నంబర్:
ఆడారి ఉమా శంకరరావు
📞 8328417559

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......