;

బీసీ సంఘం ఆధ్వర్యంలో జన్నారంలో సావిత్రిబాయి పూలే జయంతి

news

బీసీ సంఘం ఆధ్వర్యంలో జన్నారంలో సావిత్రిబాయి పూలే జయంతి

జన్నారం, జనవరి 3:
జన్నారం మండల కేంద్రంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం జన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో నేడు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ మాట్లాడుతూ, స్త్రీలకు విద్య అనే వెలుగును అందించిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే గారని అన్నారు. అక్షరాల ద్వారా చీకటిలో ఉన్న సమాజానికి దారి చూపిన విప్లవమాతగా ఆమె చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. అనేక అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొని మహిళల విద్య కోసం పోరాడిన ధైర్యశాలిగా సావిత్రిబాయి పూలే గారు ఆదర్శప్రాయులని తెలిపారు. ఆమె వేసిన విద్యాబాటలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో-కన్వీనర్ కడార్ల నరసయ్య, పొనకల్ గ్రామ వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కంచె నరసయ్య, కట్ట వెంకటేశ్వర్లు, శ్రీరాముల ఆంజనేయులు, వడ్డెర సంఘం నాయకుడు కుంట సాలయ్య, రిటైర్డ్ టీచర్ సీలోజు రాజబాబు, మైనార్టీ నాయకుడు షేక్ మజర్ తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను స్మరించుకుంటూ, విద్యా-సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......