;

దేశీయ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం – ప్రజలకు శుభవార్త : సీఎం చంద్రబాబు

news

దేశీయ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం – ప్రజలకు శుభవార్త : సీఎం చంద్రబాబు

అమరావతి:
దేశీయ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్తగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా – సీఎంఐఈ (CMIE) నివేదిక ఆధారంగా ఈ విషయం వెల్లడవ్వగా, దీనిపై సీఎం చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడం, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు అమలు చేయడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగావకాశాల సృష్టి, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.

సీఎం విజన్‌–లోకేష్ పట్టుదలతో పరిశ్రమల రాక

ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు విజన్‌, మంత్రి నారా లోకేష్ పట్టుదల వల్లే రాష్ట్రానికి దేశీయ పారిశ్రామిక సంస్థలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే పాలన కొనసాగుతుండటమే ఈ విజయానికి కారణమన్నారు.

108 అంబులెన్సుల వ్యవస్థలో వైసీపీ అవినీతి

ఇదిలా ఉండగా, 108 అంబులెన్సుల వ్యవస్థలో గత వైసీపీ పాలనలో తీవ్ర అవినీతి చోటుచేసుకుందని ఏలూరు జిల్లా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆరోపించారు. ఏలూరు జిల్లా ఆసుపత్రికి మీడియాను ఆహ్వానించి, పలు ఆధారాలతో వాస్తవాలను వివరించారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యవస్థలో అవినీతిని కూటమి ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు.

విదేశాల్లో ఉన్నా రాష్ట్రంపై సీఎం నిరంతర సమీక్ష

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలిపారు. సీఎం విదేశీ పర్యటనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన సాగుతోందని, దీని వల్ల రాష్ట్రానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు.

భూ యజమానుల హక్కుల పరిరక్షణ

రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా భూ యజమానుల హక్కులను కూటమి ప్రభుత్వం కాపాడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. భూ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......