;

బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్

news

బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌

అమరావతి | Jan 06, 2026 | 06:15 AM

ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం పరిధి నుంచి తొలగించి, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కో-ఆపరేటివ్ (సహకార) చట్టం కిందకు తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం–2001 కింద నమోదు చేశారు. అయితే నూర్‌బాషా / దూదేకుల వర్గానికి చెందిన వారు అనాదిగా దూది వడకటం, పత్తి సాగు, కాటన్ ఫ్యాబ్రిక్ తయారీ, పరుపుల తయారీ వంటి సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి నేపథ్యంలో ఈ వృత్తుల్లో ఉపాధి అవకాశాలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సమాజానికి మరింత సమగ్ర సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం కలుగుతుందని, ఆర్థిక స్వావలంబన దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......