;

గవర జాతి చరిత్రకు సావనీర్‌లో చారిత్రక గుర్తింపు

news

గవర జాతి చరిత్రకు సావనీర్‌లో చారిత్రక గుర్తింపు

అంతర్జాతీయ గోలి సేన విద్యా సామాజిక సమాఖ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర జాతి సాహసిక, పోరాటాత్మక చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సావనీర్‌లో గవర జాతి ప్రాచీన చరిత్ర, వృత్తి నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక జీవనం, త్యాగాలు, పోరాటాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో గవరుల పాత్రను సమగ్రంగా పొందుపరిచారు.

ఈ సావనీర్‌ను ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ ఆదారి ఉమాశంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గవర జాతి చరిత్రను లిఖిత రూపంలో భద్రపరచడం అత్యంత అవసరమని, చరిత్ర తెలిసినప్పుడే జాతి ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన బలపడుతుందని పేర్కొన్నారు.

తరతరాలుగా గవర జాతి ఎదుర్కొన్న అన్యాయాలు, అవమానాలు, దోపిడీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటాలను ఈ సావనీర్‌లో స్పష్టంగా వివరించారు. అలాగే విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అంశాలపై గవర జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఈ సావనీర్ ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారు.

సావనీర్ విడుదల కార్యక్రమంలో గవర జాతి కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రముఖ నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా గవర జాతి ఐక్యతతో ముందుకు సాగాలని, హక్కుల సాధన కోసం సంఘటిత ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ఆదారి ఉమాశంకరరావు, వి.వి. రాము బాజారావు, ఎస్.ఆర్.ఏ.ఎస్. అప్పలనాయుడు, పి.వి. రామారావు, శక్తివంతి అప్పలనాయుడు, భూక్య శ్రీనివాస్ రావు, దాడి వీరభద్రరావు, కొలత రామకృష్ణ, భూక్య వెంకటేశ్వర్లు, ఆదారి బాలకృష్ణ, ఆదారి ఆనందరావు, ఆదారి రామారావు, బొడ్డా రామకృష్ణ, చింతల శ్రీనివాస్, మద్దు అప్పలనాయుడు, వీర శేఖరరావు, బొడ్డా హనుమంతరావు, వేముల ప్రసాద్, బొడ్డా జగన్నాథరావు, కొలత జగన్నాథరావు, దాడి లక్ష్మణరావు, కొండాల జగన్నాథరావు, మల్ల సురేంద్రరావు, దాడి రాము చిట్టిబాబు, మల్ల రాంబాబు, డా. జె.ఎం. నారాయణరావు, బొడ్డా అప్పలనాయుడు, కాళిందుల శ్రీనివాస్, వేగి విజయకుమార్, శేఖర్ వెంకటేశ్వరరావు, తోటకూర అప్పలనాయుడు, కొలత విజయరామారావు, మల్ల సత్యనారాయణ, వడ్డెశి రామారావు, మల్లేశ్వరరావు, పాలేటి శ్రీనివాస్, శ్రీకాంత్ చందు, భూక్య మోహన్ రావు, శేఖర్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఈ సావనీర్ విడుదల కార్యక్రమం గవర జాతి చరిత్రను అధికారికంగా నమోదు చేసిన ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

సంప్రదింపు వివరాలు 

చిరునామా: డోర్ నం. 57-1-43, గోకులనగర్,

కొమ్మాది, విశాఖపట్నం – 530008, ఆంధ్రప్రదేశ్

సెల్ & వాట్సాప్ నెంబర్: 8328417559

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......