;

జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు ప్రజాస్వామ్యంపై దాడి : మేడా శ్రీనివాస్

news

జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు ప్రజాస్వామ్యంపై దాడి : మేడా శ్రీనివాస్

– జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (JDRF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టేట్మెంట్

Hyderabad:

జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని Journalist Democratic Rights Forum (JDRF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్తంభమని, అలాంటి జర్నలిస్టులను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రి సంబంధిత వార్త వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతున్న దశలోనే NTV ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఆ కథనంపై ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా తెలిపినప్పటికీ, ఆ తర్వాత కూడా జర్నలిస్టులపై కఠిన చర్యలకు దిగడం ప్రభుత్వ దురుద్దేశాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.

“సిట్‌పై నిజంగా నమ్మకం ఉంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. ముందస్తు అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నంగానే కనిపిస్తున్నాయి. అసత్య కథనాలపై ఖండన కోరుకోవడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం హక్కే కానీ, అర్ధరాత్రి అరెస్టులు, కుటుంబ సభ్యుల ముందే పోలీస్ దాడులు మీడియాను భయపెట్టే చర్యలుగా భావించాల్సి వస్తుంది” అని మేడా శ్రీనివాస్ అన్నారు.

అరెస్టైన ముగ్గురు సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారి పాత్ర ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారిని నేరస్థులుగా చూపించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు. ఈ తరహా చర్యలు కొనసాగితే రేపు నిజం చెప్పే ప్రతి గొంతు ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా JDRF డిమాండ్లు:

ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి.

జర్నలిస్టులపై అర్ధరాత్రి అరెస్టుల సంస్కృతిని వెంటనే నిలిపివేయాలి.

మీడియా స్వేచ్ఛకు, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.

సిట్ విచారణను పారదర్శకంగా, రాజకీయ ఒత్తిడులు లేకుండా కొనసాగించాలి.

మీడియా స్వేచ్ఛను అణిచే ఏ ప్రయత్నాన్నైనా దేశవ్యాప్తంగా తోటి జర్నలిస్టు సంఘాలతో కలిసి తీవ్రంగా ఎదుర్కొంటామని మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు.

— మేడా శ్రీనివాస్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (JDRF)

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......