మార్కాపురం జిల్లా పామూరులో యువకుడిపై అమానుష దాడి
మార్కాపురం జిల్లా పామూరులో యువకుడిపై అమానుష దాడి
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మార్కాపురం జిల్లా పామూరు మండలంలో బీసీ (రజక) సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన కమ్మ సామాజిక వర్గ యువకులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బైక్కు ఆటో తగిలిందనే చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకుని, బాధిత యువకుడిని సుమారు ఆరు గంటల పాటు స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టినట్లు సమాచారం.
ఇదే కాకుండా, చిన్న పిల్లలపై బాంబులు పేల్చడం, కార్లతో గుద్దేందుకు ప్రయత్నించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి అహంకారపూరిత, కులవివక్షతో కూడిన దాడులు ప్రజాస్వామ్య సమాజంలో అనుమతించరానివని సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. కులం, పార్టీ అనే భేదాభిప్రాయాలు లేకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా, నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బాధితులకు పూర్తి న్యాయం చేయడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని, ప్రాంతంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......