;

మార్కాపురం జిల్లా పామూరులో యువకుడిపై అమానుష దాడి

news

మార్కాపురం జిల్లా పామూరులో యువకుడిపై అమానుష దాడి

దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

మార్కాపురం జిల్లా పామూరు మండలంలో బీసీ (రజక) సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన కమ్మ సామాజిక వర్గ యువకులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బైక్‌కు ఆటో తగిలిందనే చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకుని, బాధిత యువకుడిని సుమారు ఆరు గంటల పాటు స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టినట్లు సమాచారం.

ఇదే కాకుండా, చిన్న పిల్లలపై బాంబులు పేల్చడం, కార్లతో గుద్దేందుకు ప్రయత్నించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు ప్రాంతంలో శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి అహంకారపూరిత, కులవివక్షతో కూడిన దాడులు ప్రజాస్వామ్య సమాజంలో అనుమతించరానివని సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. కులం, పార్టీ అనే భేదాభిప్రాయాలు లేకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా, నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాధితులకు పూర్తి న్యాయం చేయడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని, ప్రాంతంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Related video

📎 Similar News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......