;

తల్లిదండ్రుల పోరాటానికి మరో విజయం

news

తల్లిదండ్రుల పోరాటానికి మరో విజయం

తరగతుల విభజన వివక్షపై వెనక్కి తగ్గిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం

అమరావతి:

మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులపై అమలుచేసిన వివక్షాపూరిత తరగతుల విభజన నిర్ణయానికి తల్లిదండ్రుల పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో, యూనివర్సిటీ యాజమాన్యం ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

“స్కిల్ డెవలప్‌మెంట్” పేరుతో అదనపు ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఒక విధంగా, చెల్లించని విద్యార్థులకు మరో విధంగా తరగతులు విభజించడం ద్వారా యాజమాన్యం తీవ్ర వివక్షకు పాల్పడిందని PAAP ఆరోపించింది. ఈ అంశంపై ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖకు చేసిన ఫిర్యాదులతో అధికారులు స్పందించి యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.

దీంతో యాజమాన్యం ఇకపై అందరు విద్యార్థులను ఒకే తరగతిగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రుల ఐక్యతకు లభించిన కీలక విజయంగా PAAP పేర్కొంది.

ఇదే సమయంలో, స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 40,000 చొప్పున అక్రమంగా వసూలు చేసిన అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని PAAP తెలిపింది. ఫీజు చెల్లించని విద్యార్థులను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి తొలగిస్తామని బెదిరించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

అలాగే, గతంలో ఇదే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 26 కోట్లను తిరిగి చెల్లించాలని, రూ. 15 లక్షల పెనాల్టీ చెల్లించాలని రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని PAAP డిమాండ్ చేసింది.

విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యూనివర్సిటీలను సహించేది లేదని PAAP హెచ్చరించింది. అక్రమ ఫీజుల వసూళ్లపై వెంటనే విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరింది. తల్లిదండ్రులంతా ఐక్యంగా ఉంటేనే విద్యా చట్టాల అమలు సాధ్యమవుతుందని, మన పిల్లల భవిష్యత్తు రక్షణ సాధ్యమవుతుందని PAAP పేర్కొంది.

సంప్రదింపు వివరాలు:

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)

📞 ఫోన్: +91 63053 13558

📧 ఈమెయిల్: parentsassociationap@gmail.com

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......