ఫూలే విగ్రహంపై దాడి — మనువాద ఉగ్రవాదులను తక్షణమే అరెస్ట్ చేయాలి
ఫూలే విగ్రహంపై దాడి — మనువాద ఉగ్రవాదులను తక్షణమే అరెస్ట్ చేయాలి
తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి : ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక డిమాండ్
తెలంగాణ రాష్ట్రం, రామచంద్రపురం మండలం, తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహంపై పట్టపగలు, పోలీసుల సమక్షంలోనే దుండగులు కాళ్లతో తన్ని కూల్చేందుకు ప్రయత్నించడం అత్యంత హేయమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
సామాజిక సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు ఫూలే విగ్రహంపై ఈ విధమైన మూకదాడి చేయడం ద్వారా మనువాద ఉగ్రవాదులు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరగడం. ఇది శాంతిభద్రతల వైఫల్యాన్ని, అలాగే దళిత–బహుజనులపై జరుగుతున్న దాడుల పట్ల నిర్లక్ష్య ధోరణిని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ సంఘటనపై
-
దాడికి పాల్పడ్డ మనువాద ఉగ్రవాదులను తక్షణమే అరెస్ట్ చేయాలి,
-
వారి పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,
-
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి,
-
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి
అని ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక గట్టిగా డిమాండ్ చేస్తోంది.
ఫూలే ఆశయాలపై దాడి అంటే అది సమాజ సమానత్వంపై దాడి చేసినట్లే. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్య శక్తులు ఏనాడూ సహించవు. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ వేదిక స్పష్టం చేస్తోంది.
— ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......