మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం: కర్నూలు ఎంపీ, కొడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ పరిధిలోని సుంకేసుల డ్యామ్ వద్ద చేప పిల్లల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కర్నూలు ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు, కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి చేతుల మీదుగా మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ బి.ఎస్. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో 1.66 లక్షల చేప పిల్లలను జలాశయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, మత్స్యకారుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. సాంప్రదాయ మత్స్యకారులను ఎస్.టి జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ, మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సుంకేసుల జలాశయంలో 4.16 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని, దీని ద్వారా మత్స్యకారులకు గణనీయమైన లాభం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ శ్రీ రంగనాథ్ బాబు, బెస్టా కార్పొరేషన్ డైరెక్టర్లు రామాంజనేయులు, భాస్కర్, ఎఫ్డీఓ మద్దిలేటి, జిల్లా డైరెక్టర్ శ్రీనివాసులు, సుంకేసుల సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మత్స్యకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......