తెల్లాపూర్ అమరుడు సాయి ఈశ్వర చారికి బీసీ ఐక్యవేదిక తరఫున ఘన నివాళులు
తెల్లాపూర్ అమరుడు సాయి ఈశ్వర చారికి బీసీ ఐక్యవేదిక తరఫున ఘన నివాళులు
పఠాన్చేరు, డిసెంబర్ 08 :
తెల్లాపూర్ బీసీ సంఘం ఆధ్వర్యంలో, మాజీ ఉప సర్పంచ్ ఎన్. కృష్ణ అధ్యక్షతన గద్దర్ సర్కిల్ వద్ద అమరుడు సాయి ఈశ్వర చారికి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, అమరుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సాయి ఈశ్వర చారి కుటుంబంలోని పిల్లల విద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, కుటుంబంలోని ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలి అని రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలను వరుసగా మోసం చేశాయని ఆయన విమర్శించారు.
మాజీ ఉప సర్పంచ్ ఎన్. కృష్ణ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా నిలిచి తమ ఓటుతో శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. వడ్డే నరసింహులు మాట్లాడుతూ, బీసీ యువత నిరాశకు గురికాకుండా హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సాయన్న, మాజీ సర్పంచ్ పి. కుమార్ గౌడ్, వడ్డే నరసింహులు, మాజీ కౌన్సిలర్లు భరత్, శ్రీశైలం, చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, ఎల్. రవీందర్, ఐలేష్ యాదవ్, కంజర్ల కృష్ణమూర్తి చారి, రాగం రమేష్ యాదవ్, జర్నలిస్ట్ కృష్ణ, వంగూరు శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, విజయలక్ష్మి, హరికృష్ణ చారి, అందేలా కుమార్ యాదవ్, శివా యాదవ్, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు అమరుడు సాయి ఈశ్వర చారికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
📎 Similar News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్లోని మాతృశ్రీనగర్లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
🆕 Latest News
పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !
సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......
మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......