;

GHMCలో మున్సిపాలిటీల విలీనం బీసీల రాజకీయ హక్కులకు ముప్పు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం

news

GHMCలో మున్సిపాలిటీల విలీనం బీసీల రాజకీయ హక్కులకు ముప్పు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం

GHMC పరిధిలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై శాసన మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు.

బీసీలకు రాజకీయంగా లభిస్తున్న అవకాశాలను ఈ విలీనంతో క్రమంగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. “ప్రస్తుతం ఒక మున్సిపాలిటీలో 20 మంది వరకు వార్డు మెంబర్లు గెలిచే అవకాశం ఉంటుంది. అదే GHMCలో విలీనమైతే ఒక్క కార్పొరేటర్‌కే అవకాశం మిగులుతుంది. ఇది బీసీల రాజకీయ ప్రతినిధిత్వాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది” అని స్పష్టం చేశారు.

ఈ అంశంపై ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ, బీసీలకు కలిగే రాజకీయ నష్టంపై ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. “బిల్లుల మీద బిల్లులు మార్చుకుంటూ పోతే, బీసీల పరిస్థితి ఏంటి?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

GHMCలో మున్సిపాలిటీల విలీన బిల్లుతో బీసీ వర్గాల రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తీన్మార్ మల్లన్న మండలిలో పేర్కొన్నారు. ఈ బిల్లును పునఃపరిశీలించి, బీసీలకు న్యాయం చేసేలా సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......