;

వడ్డెరలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి జాతియ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్

news

వడ్డెరలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రప్రభ):

వడ్డెర కులానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ డీసీసీ చైర్మన్, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ట శ్రీధర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వడ్డెర కులం నుంచి కేవలం ఒక్కరే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం డీసీసీ కార్యాలయంలో వడ్డెర కుల సంఘాల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పిట్ట శ్రీధర్ మాట్లాడుతూ వడ్డెర కులం జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యం ఎదుర్కొంటోందన్నారు. శాసనసభ, శాసనమండలి, స్థానిక సంస్థల్లో వడ్డెరలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వడ్డెర కులానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,

“వడ్డెరలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వర్గం. అయినప్పటికీ రాజకీయంగా వారికి న్యాయం జరగడం లేదు. బీసీల ఐక్యతతోనే హక్కులు సాధించుకోవాలి. వడ్డెరలకు తగిన రాజకీయ వాటా దక్కే వరకు బీసీ జేఏసీ తరఫున పోరాటం కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు.

అదేవిధంగా వడ్డెర బంధు పథకం ప్రవేశపెట్టి వడ్డెరలను ఆర్థికంగా ఆదుకోవాలని, మైనింగ్ క్వారీలు, కాంట్రాక్టుల్లో వడ్డెరలకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, మహిళా ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......