;

శేరిలింగంపల్లి రాయదుర్గం దర్గా యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర యాదవ క్యాలెండర్ ఆవిష్కరణ

news

శేరిలింగంపల్లి రాయదుర్గం దర్గా యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర యాదవ క్యాలెండర్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లి రాయదుర్గం దర్గా యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర యాదవ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని యాదవ సంఘం నేత నాగపురి అశోక్ యాదవ్ సమన్వయంతో నిర్వహించారు.

ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, అఖిల భారత యాదవ మహాసభ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తైన తరుణంలో యాదవులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ సామాజిక, రాజకీయ ఉనికిని చాటుకున్నారని అన్నారు. యాదవులు ఐక్యంగా ముందుకు సాగితే మరింత బలంగా ఎదగగలరని స్పష్టం చేశారు.

పాడి పరిశ్రమపై మాట్లాడిన ఆయన, సంప్రదాయంగా యాదవుల ఆధీనంలో ఉన్న పాల వ్యాపారం క్రమంగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల యాదవ పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు డిమాండ్లు చేశారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన యాదవులకు ప్రభుత్వ స్థలాల్లో పశువుల మేతకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, యాదవులకు కార్పొరేట్ స్థాయిలో పాల డైరీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

రాజకీయ చైతన్యం పెరిగినప్పుడే యాదవులకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కుతుందని బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో యాదవులు, బీసీలు ఐక్యంగా నిలబడి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు అప్పల కృష్ణ యాదవ్, నాగపురి అశోక్ యాదవ్, మహేష్ యాదవ్, బండా ప్రవీణ్ యాదవ్తో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

పౌర బాధ్యత — పరిణతి చెందిన సమాజానికి కొలమానం !

సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కేవలం అక్కడి మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి లేదా ప్రభుత్వ విధానాల ద్వారా మాత్రమే అంచనా వేయలేం. ఆ సమాజంలోని పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను ఎంతగా అర్థం చేసుకుని నిర్వర్తిస్తున్నారన్నదే నిజమైన పరిణతికి కొలమానం.పౌర బాధ్యత అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. రాజ్యాంగ......

మార్కులు కాదు… మనిషి విలువ ముఖ్యం !

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఒత్తిడిలో నలిగిపోతున్న యువత మానసిక ప్రపంచంపై సమాజం ఆత్మపరిశీలన చేయాలి“నా మార్కులే నా విలువ” — నేటి విద్యా పోటీ ప్రపంచంలో కొంతమంది విద్యార్థుల మనస్సుల్లో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రమాదకరమైన భావన ఇది.వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్, ఇంజినీరింగ్ విద్య......

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......